Friday, March 15, 2024

కవితను ఎందుకు అరెస్టు చేశారంటే... ఆర్డర్‌ ఇదీ... ED asst Director Joginder order on Kavitha arrest in Delhi liquor scam

 కవితను ఎందుకు అరెస్టు చేశారంటే... ఆర్డర్‌ ఇదీ...


బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ (BRS MLC), కేసీఆర్‌ (KCR) కూతురు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)ను మనీ లాండరింగ్‌ కేసులో అరెస్టు చేస్తున్నట్లు ఈడీ అధికారులు చెప్పారు. ఆమెను సాయంత్రం 5.20 గంటలకు అరెస్టు చేసినట్లు చెప్పారు. ఆమె అరెస్టు సమాచారాన్ని భర్తకు తెలియజేసినట్లు తెలిపారు. ఈడీ (ED) అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జోగీందర్‌ (Joginder) పేరుతో ఈరెస్టు ఆర్డర్‌ను జారీ చేశారు. 



‘‘ఎమ్మెల్సీ కవిత.. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం (పిఎంఎల్‌ యాక్ట్‌) ` 2002 కింద శిక్షార్హమైన నేరానికి పాల్పడ్డారని విశ్వసించేందుకు నా వద్ద కారణాలు ఉన్నాయని ఈడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న జోగీందర్‌ అనే నేను తెలియజేస్తున్నాను. మనీ ల్యాండరింగ్‌ చట్టంలోని సెక్షన్‌ 19లోని సబ్‌ సెక్షన్‌ (1) కింద నాకున్న అధికారాల మేరకు ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తున్నానని తెలియజేస్తున్నాను. సాయంత్రం 5.20 గంటలకు అరెస్టు చేశాం. అరెస్టుకు గల కారణాలను వివరిస్తూ 14 పేజీలతో కూడిన రిపోర్టును కవితకు అందజేశాం’’ అని నోటీసులో వివరించారు.

ధైర్యం చెప్పిన కేటీఆర్‌

అరెస్టు చేసిన తర్వాత కవిత తన నివాసం వద్దకు వచ్చిన కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు. కవిత అరెస్టు చేసిన సమయంలో అక్కడే ఉన్న సోదరుడు కేటీఆర్‌ (KTR) తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నేనున్నా అన్నీ చూసుకుంటానని ఆయన ధైర్యం చెప్పారు. కవితను ఈడీ అధికారులు హస్తినకు తరలిస్తున్న సమయంలోనే కేటీఆర్‌ కూడా ఢల్లీికి బయలుదేరారు. 

కవిత స్పందన ఇదీ...

తన అరెస్టుపై కవిత స్పందించారు. ఇలాంటి అణచివేతలు ఎన్ని జరిగినా ఎదుర్కుంటామని ఆమె అన్నారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు బలంగా మనోధైర్యంతో ఉండాలని ఆమె కోరారు. కవిత అరెస్టును కార్యకర్తలు, అభిమానులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వారిపై లాఠీచార్జీ చేసి, రూట్‌ క్లియర్‌ చేసి ఆమెను శంషాబాద్‌ విమానాశ్రయానికి తరలించారు. 

అమిత్‌ అరోరా సమాచారంతోనే...

అమిత్‌ అరోరా (Amit Arora) ఇచ్చిన సమాచారంతోనే కవితను ఈడీ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. Delhi మద్యం కేసు (Delhi liquor scam)లో సౌత్‌ లాబీపై అతను సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. నాలుగు రోజులుగా అతన్ని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. రేపు (శనివారంనాడు) అమిత్‌ అరోరా సమక్షంలో కవితను విచారించే అవకాశం ఉంది. 

సౌత్‌ గ్రూప్‌ (South Group)లో కవిత కీలక పాత్ర పోషించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించినట్లు సమాచారం. సౌత్‌ గ్రూప్‌లో వాణిజ్యవేత్త శరత్‌ రెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Magunta Srinivasulu Reddy), ఆయన కుమారుడు రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్నారు. వీరిలో శరత్‌ రెడ్డి, రాఘవరెడ్డి అప్రూవర్స్‌గా మారారు. అరుణ్‌ పిళ్లై, బుచ్చిబాబు ద్వారా సౌత్‌ గ్రూప్‌ వ్యవహారం నడిపినట్లు దర్యాప్తులో తేలింది.

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...