Delhi లిక్కర్ స్కామ్: కథ నడిపిందంతా కల్వకుంట్ల కవితనే
Delhi మద్యం కుంభకోణాన్ని Delhi excise policy scam) నడిపిందంతా బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ, కేసీఆర్ (KCR) తనయ కల్వకుంట్ల కవిత (kalvakuntla Kavithaనే అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) (ఈడి) తెలిపింది. కవిత రిమాండ్ రిపోర్టులో ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి. సౌత్ లాబీ (South Lobby) పేరుతో లిక్కర్ స్కాంలో కవిత కీలకంగా వ్యవహరించారని తేల్చింది. Delhi మద్యం కుంభకోణంలో కీలక కుట్రదారు, ప్రధాన లబ్ధిదారు కూడా ఆమెనే అని చెప్పింది.
కవిత కస్టడీ రిపోర్టు ప్రకారం.... ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadami party) (ఆప్)కి కవిత లిక్కర్ స్కామ్ ముడుపుల కింద వంద కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి (Magunta Srinivasulu Reddy)తో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్ర చేశారు. కవితకు బినామీగా వ్యాపారవేత్త రామచంద్ర పిళ్లై ఉన్నారు. రామచంద్ర పిళ్లై ద్వారా కవిత వ్యవహారమంతా నడిపించారు. ఆయనను డమ్మీగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో కవిత వాటా పొందారు.
ఇతరులతో కలిసి కవిత ఆప్ (AAP) నేతలకు వంద కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చారు. కేసు నుంచి తప్పించుకునేందుకు కవిత తన మొబైల్లోని ఆధారాలను తొలగించారు. సౌత్ గ్రూప్లోని శరత్ చంద్రారెడ్డి మాగుట శ్రీనివాసులు రెడ్డి, మాగంట రాఘవరెడ్డిలతో కలిసి ఆప్ నేతలతో కవిత కుట్రలు పన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ద్వారా కవిత రూ.30 కోట్లు ఢల్లీికి చేర్చారు. రూ.30 కోట్లు అభిషేక్ బోయినపల్లి హస్తినకు తీసుకుని వెళ్లాడు.
ఇదిలావుంటే, కోర్టు కవితను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 23వ తేదీ వరకు ఆమెను ఈడీ కస్టడీకి అప్పగించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆమెను విచారించాలని, విచారణను వీడియోలో రికార్డు చేయాలని ఆదేశించింది. ఈ నెల 23 తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు ఆమెను కోర్టులో హాజరు పరచాలని ఆదేశించింది.
కవితకు మరో షాక్ తగిలింది. ఆమె భర్త (Kavitha husband) అనిల్ (Anil), పీఆర్వో రాజేశ్ సహా మరో ముగ్గురికి ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారంనాడు తమ విచారణకు హాజరు కావాలని వారిని ఆదేశించింది. ఇప్పటికే వారి మొబైల్స్ను ఈడీ స్వాధీనం చేసుకుంది. కవిత నివాసంలో సోదాలు నిర్వహించిన సమయంలో వాటిని స్వాధీనం చేసుకుంది.
No comments:
Post a Comment