కేసీఆర్కు భారీ షాక్: ఎన్నికల వేళ కవిత అరెస్టు
లోక్సభ ఎన్నికల వేళ (Lok Sabha Elections 2024) బీఆర్ఎస్ (BRS) అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)కు భారీ షాక్ తగిలింది. ఆయన కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. Delhi మద్యం కుంభకోణం (Delhi liquor Scam) కేసులో ఆమెను అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం నుంచి ఈడీ (ED) అధికారులు ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. సాయంత్రం ఆమెను అరెస్టు చేసినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆమె ఈడీ విచారణకు గైర్హాజరవుతూ వచ్చారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్న కారణంగా తాను హాజరు కాలేనని చెబుతూ వచ్చారు.
సోదాల సమయంలో కవిత నివాసానికి మాజీ మంత్రులు హరీష్ రావు (Harish Rao), కేటీఆర్ (KTR) చేరుకున్నారు. కేటీఆర్ ఈడీ అధికారులతో వాదనకు దిగారు. సుప్రీంకోర్టులో కేసు ఉండగా ఎలా అరెస్టు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ట్రాన్సిట్ అరెస్టు వారంట్ లేకుండా కవితను ఎలా హస్తినకు తరలిస్తారని కూడా ఆయన అడిగారు. సుప్రీంకోర్టులో అండర్ టేకింగ్ ఇచ్చి కూడా అరెస్టు చేయడమేమిటని ఆయన వాదించారు. అయితే, అవేమీ పట్టించుకోకుండా కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసి, Delhiకి తరలించే ఏర్పాట్లు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) ఓ వైపు మల్కాజిగిరి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలోనే కవిత అరెస్టు అయ్యారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో కవిత ఉదంతంపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. బీఆర్ఎస్కు బీజేపీతో ఉన్న రహస్య అవగాహన కారణంగానే కవితను అరెస్టు చేయలేదని అప్పట్లో విమర్శించారు. ఆ కారణంతోనే ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వంటివారు బీజేపీలో చేరలేదు.
Delhi మద్యం కుంభకోణంలో కవిత కీలక పాత్ర వహించారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఆ కారణంగానే ఆమెను అరెస్టు చేశారు. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన స్థితిలో కవిత అరెస్టు కావడం కేసీఆర్ పెద్ద దెబ్బనే.
No comments:
Post a Comment