Friday, February 9, 2024

చంద్రబాబు, జగన్‌...ఇద్దరినీ ఉతికి ఆరేసిన వైఎస్సార్‌ ఆత్మ - KVP Ramachandar Rao makes verbal attack on YS Jagan, Chandrababu

 చంద్రబాబు, జగన్‌...ఇద్దరినీ ఉతికి ఆరేసిన వైఎస్సార్‌ ఆత్మ


టీడీపీ (TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి (Nara Chandrababu Naidu)ని, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (AP CM) వైఎస్‌ జగన్‌ (YS Jagan)ను... ఇద్దరినీ వైఎస్సార్‌ ఆత్మగా పేరు పొందిన కాంగ్రెస్‌ నాయకుడు కేవీపీ రామచందర్‌ రావు (KVP Ramachandar Rao) ఉతికి ఆరేశారు. ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) దయాదాక్షిణ్యాల కోసం వారు ప్రయత్నిస్తున్నారనే ఉద్దేశంతో ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మోడీ పాదాల కోసం ఇద్దరూ ప్రయత్నించడం వల్ల జరిగేదేం లేదని ఆయన అన్నారు. టీడీపీ, వైసీపీ (YCP) ప్రభుత్వాలను మోడీ ఏటీఎంలుగా వాడుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు.



చంద్రబాబును మోడీ పర్సనల్‌గా కలవాలని అనుకోలేదని అనిపిస్తున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల దేశ రాజధాని హస్తిన (Delhi)లో చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah), బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా (JP Nadda)లతో సమావేశమయ్యారు. మోడీని కలవలేకపోయారు. దీన్ని ఉద్దేశించి కేవీపీ (KVP) ఆ అభిప్రాయం వ్యక్తం చేశారు. మోడీ కలవకపోయినా సంతృప్తి చెంది వచ్చేశారు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు జాతి ప్రయోజనాలు అవసమైతే తప్ప గుర్తు రావని ఆయన విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం, అధికారం కోసం చంద్రబాబు హస్తిన వెళ్లారా? ఆని ప్రశ్నిస్తూ ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు మోడీ సన్నిధికి చేరుకోలేకపోయారని, జగన్‌ చేరుకోగలిగారని ఆయన వ్యాఖ్యానించారు. మోడీతో జగన్‌ ఈ నెల 9వ తేదీన సమావేశమైన విషయం తెలిసిందే. దీన్ని ఉద్దేశించి ఆయన ఆ విధంగా అన్నారు.

హోం మంత్రి అమిత్‌ షా మీద తిరుపతి (Tirupathi)లో చంద్రబాబు రాళ్లు వేయించారని, 2019లో విద్రోహదినం నిర్వహించారని, రాజకీయ చతురుడినని చంద్రబాబు ఆయనను ఆయనే అనుకుంటారని కేవీపీ దెప్పి పొడిచారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ (United Andhra Pradesh) రాష్ట్రానికి చంద్రబాబు సుదీర్ఘ ముఖ్యమంత్రి అని, అదే రాష్ట్రానికి సుదీర్ఘ ప్రతిపక్ష నాయకుడని ఆయన అన్నారు. 

బిజెపి (BJP)ని కూడా ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. 2019లోనూ, 2024లోనూ ఏపీకి బిజెపి కల్పించిన ప్రయోజనాలేమిటని ఆయన అడిగారు. 2014లో తిరుపతి బాలాజీ సాక్షిగా ఏపీకి అన్యాయం జరిగిందని మోడీ చెప్పారని, పదేళ్లపాటు ప్రత్యేక హోదా (Special Category Status) ఇస్తామని చెప్పారని ఆయన గుర్తు చేశారు. అమరావతి (Amaravati)కి మోడీ పవిత్ర జలాలకు బదులు కలుషిత జలాలు తెచ్చారని వ్యాఖ్యానించారు. పార్లమెంటులో ఈ అంశాల మీద మోడీని ఎవరూ ప్రశ్నించలేదని ఆన్నారు.

మహా కూటమిలో భాగంగా చంద్రబాబు, పవన్‌ (Pawan Kalyan), మోడీ కలిసి 2014ల వరాల తుఫాను కురిపించారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తమపై రాళ్లు విసిరారని, 2018లో చంద్రబాబు రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)తో వేదికను పంచుకున్నారని, చంద్రబాబు నితీష్‌ కుమార్‌ (Nitish Kumar) రికార్డును బద్దలు కొట్టారని ఆయన వ్యాఖ్యానించారు. 

రాష్ట్రంలో మద్యం, ఇసుకల్లో వచ్చే ప్రయోజనాల్లో బిజెపి వాటా లేకుండా ఉండే అవకాశం లేదని ఆయన అన్నారు. అన్ని రాష్ట్రాల నాయకులు అరెస్టవుతారు గానీ ఏపీ నాయకులు అరెస్టు కారని ఆయన అన్నారు. ఎన్నికల తర్వాత బిజెపి వస్తే మమత కూడా జైలుకు వెళ్లవచ్చునని ఆయన అన్నారు. బిజెపి దృష్టిలో ఏపీ చాలా క్లీన్‌ అని, ఈడీ దృష్టిలో కూడా క్లీన్‌ అని ఉందా అని ఆయన అడిగారు. సిఎం వెళ్లినప్పుడల్లా ఏపీ ఆణిముత్యం అని కేంద్రం సర్టిఫికెట్‌ ఇస్తుందని ఆయన అన్నారు. సీట్లు, స్వీట్ల పంపకం తప్ప మరేవీ వాళ్లు మాట్లాడుకోలేని ఆయన అన్నారు. మోడీ, జగన్‌ మధ్య జరిగిన భేటీపై ఆయన ఆ విధంగా అన్నారు. 

తల్లిని, సోదరిని ప్రతి కొడుకు, సోదరుడు గౌరవించాలని, సొంత తల్లి వ్యక్తిత్వాన్ని కించపరిచినవారిపై చర్యలు తీసుకోని అసమర్థ ప్రభుత్వం అని జగన్‌ను ఉద్దేశించి అన్నారు. 

-కాసుల ప్రతాపరెడ్డి

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...