Thursday, January 18, 2024

రసకందాయంలో నెలూరు జిల్లా రాజకీయాలు: ముందు వరుసలో మల్లికార్జున్‌ రావు - Mallikarjun Rao in race for Udayagiri TDP ticket

రసకందాయంలో నెలూరు జిల్లా రాజకీయాలు: ముందు వరుసలో మల్లికార్జున్‌ రావు


ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు (AP Assembly Elections 2024) కొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలయ్యాయి. ఈ స్థితిలో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా రాజకీయ సమీకరణాలు మారే సూచనలు కనిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో సాధారణంగా రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం కొనసాగుతూ వస్తున్నది. అయితే ఈసారి పార్టీల అధినాయకులు బీసీల వైపు చూస్తున్నారు. ప్రధానంగదా ఉదయగిరి శాసనసభ నియోజకవర్గం Udayagiri assembly segment) అభ్యర్థుల విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వైఎస్‌ జగన్‌ (YS Jagan) నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి (Mekapati Rajagopal Reddy) పోటీ చేయడం దాదాపుగా ఖరారైంది. 



తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) సరైన అభ్యర్థి కోసం చూస్తున్నారు. మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డికి టికెట్‌ దక్కే అవకాశాలు లేనట్లు సమాచారం. బీసీ నేతను రంగంలోకి దింపాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తున్నది. ఆయన బీద రవిచంద్ర (Beeda Ravichandra) వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది. అయితే, తాను పోటీ చేయబోనని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ స్థితిలో టిడిపి (TDP) టికెట్‌ కోసం ఇద్దరి మధ్య పోటీ నెకొంది. చంచల్ బాబు యాదవ్, డాక్టర్‌ మల్లికార్జున్‌ రావు (Dr Mallikarjun Rao) టిడిపి టికెట్‌ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. అయితే, చంచల్ బాబు యాదవ్ కి తగిన అర్థబలం, అంగబలం లేదని అంటున్నారు. దీంతో మేకపాటి రాజగోపాల్‌ రెడ్డికి సరితూగే అభ్యర్థిగా డాక్టర్‌ మల్లికార్జున్‌ రావు రేసులో ముందున్నారు. 



మల్లికార్జున్‌ రావు ప్రభుత్వ వైద్యుడిగదా ఉద్యోగ విరమణ చేసిన తర్వాత నెల్లూరులో వైద్యశాలను నిర్వహిస్తున్నారు. ఆయన ఉదయగిరి ప్రజలకు చిరపరిచితులు. ఉదయగిరి నియోజకవర్గంలో ఆయన ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో ఆయనకు తన యాదవసామాజికవర్గంలో మంచి పట్టు ఉండడంతో పాటు ప్రజల్లో మంచి పేరు ఉంది. 

అయితే, వైసిపి గానీ టిడిపి గానీ నెల్లూరు జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తూనే బీసీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉన్నాయి. జిల్లాలో ఈసారి రెండు నుంచి మూడు సీట్లు బీసీలకు కేటాయించాలని చూస్తున్నాయి. ఇందుకు తీవ్రమైన కసరత్తు కూడా చేస్తున్నాయి. ఇందులో భాగంగానే మల్లికార్జున్‌ రావు పేరు టిడిపి వైపు నుంచి తెర మీదికి వచ్చింది.  

-కాసుల ప్రతాపరెడ్డి 

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...