Friday, January 19, 2024

అమరావతిపై పవన్‌ కల్యాణ్‌ యూటర్న్‌: అప్పుడో మాట ఇప్పుడో మాట - Jana Sena chief Pawan Kalyan takes u turn on Amaravati

 అమరావతిపై పవన్‌ కల్యాణ్‌ యూటర్న్‌: అప్పుడో మాట ఇప్పుడో మాట


రాజకీయాల్లో నిలకడ అవసరం. అదే విధంగా ప్రధానాంశాలపై ఒక విధానం ఉండాలి. విధానాలపై స్థిరమైన నిర్ణయాలు ఉండాలి. కానీ జనసేన (Jana Sena) అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)కు అవన్నీ ఉన్నట్లు కనిపించడం లేదు. జనసేనను ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆయన నిలకడగా వ్యవహరించినట్లు కనిపించడం లేదు. అలాగే అమరావతి వంటి ప్రధానాంశాలపై ఆయన స్థిరమైన విధానం లేదు. తాజాగా ఆయన చేసిన ప్రకటన ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నది. జనవరి 14వ తేదీన టిడిపి (TDP) అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి (Nara Chandrababu Naidu)తో కలిసి బోగీ మంటల సంబరాల్లో పాల్గొని ప్రసంగించారు. అమరావతి (amaravati)ని బంగారు రాజధానిగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. తమ నినాదం జై అమరావతి (Jai Amaravati), జై ఆంధ్ర అని ఆయన చెప్పారు. జనసేన ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు వివిధ అంశాలపై స్థిరమైన నిర్ణయాలను తీసుకున్న దాఖలాలు లేవు. అమరావతి విషయంలోనూ పవన్‌ కల్యాణ్‌ మాట మార్చారు.



అమరావతి రాజధాని నిర్మాణానికి చంద్రబాబు అనుసరించిన విధానాన్ని పవన్‌ కల్యాణ్‌ 2018లో వ్యతిరేకించారు. అమరావతి టిడిపి రాజధానియా, ఆంధ్రప్రదేశ్‌ రాజధానియా అని ఆయన ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి భూసేకరణను ఆపకపోతే అమరావతిని ముట్టడిస్తామని కూడా హెచ్చరించారు. 2014 ఎన్నికలకు ముందు రాజధాని నిర్మాణానికి 1800 ఎకరాలు సరిపోతుందని చంద్రబాబు చెప్పారని, అధికారంలోకి వచ్చాక 33 వేల ఎకరాలు సేకరించడానికి పూనుకున్నారని ఆయన విమర్శించారు. భూసేకరణ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడుస్తున్నారని తప్పు పట్టారు. వివిధ ప్రాజెక్టులకు మితిమీరిన భూసేకరణకు పాల్పడి రైతులు, ప్రజల జీవితాలను విచ్ఛిన్నం చేస్తున్నారని ఆయన చంద్రబాబును దుయ్యబట్టారు. రాజధానిని అమరావతిలో ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజల అభిప్రాయాలను తీసుకున్నారా, వారి మద్దతు పొందారా అని కూడా ప్రశ్నించారు.

రాజధాని అమరావతికి సింగపూర్‌ మోడల్‌ (Singapore Model)ను తీసుకోవడాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు. రైతుల కన్నీరు పెడితే మంచిది కాదని ఆయన అన్నారు. ఈ విషయాలు ఆయన 2020లో చెప్పారు. రాజకీయ అవసరాల కోసం పవన్‌ కల్యాణ్‌ మాట మార్చి, మరో రకంగా మాట్లాడుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ నిలకడ లేని తనాన్ని ఇది పట్టిస్తున్నది. అన్ని విషయాల్లోనూ పవన్‌ కల్యాణ్‌ ఇదే ధోరణి అనుసరిస్తారని అనుకోవడంలో తప్పులేదు.

-కాసుల ప్రతాపరెడ్డి

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...