Saturday, January 6, 2024

జనసేనకు ఇచ్చే సీట్ల సంఖ్య ఇదే: బిజెపితో పొత్తుపై చంద్రబాబు పునరాలోచన - Chandrababu not interested on alliance with BJP

 జనసేనకు ఇచ్చే సీట్ల సంఖ్య ఇదే: బిజెపితో పొత్తుపై చంద్రబాబు పునరాలోచన


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బిజెపితో పొత్తు పెట్టుకునే విషయం మీద తెలుగుదేశం పార్టీ (టిడిపి) (Telugu Desam Party) అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) అనాసక్తి ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తున్నది. పవన్‌ కల్యాణ్‌ (pawan Kalyan) నాయకత్వంలోని జనసేన (Jana Sena)తో సీట్ల సర్దుబాటు (Seat Sharing) దాదాపుగా కొలిక్కి వచ్చింది. జనసేనకు 30 అసెంబ్లీ స్థానాలు, రెండు లోకసభ స్థానాలు ఖరారైనట్లు వార్తలు వచ్చాయి. బిజెపి ఎక్కువ లోకసభ స్థానాలు ఆడుతున్నది. దీంతో పాటు మైనారిటీ ఓట్లను కోల్పోతామనే భావన కూడా టిడిపి (TDP)లో ఉంది. ఆ కారణాల వల్ల బిజెపితో పొత్తుపై చంద్రబాబు పునాలోచనలో పడినట్లు చెబుతున్నారు. 



చంద్రబాబు గతంలో బిజెపితో పొత్తు పెట్టుకోవాలని ఉబలాట పడ్డారు. అయితే, తాజాగా ఆయన ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు. దీంతో బిజెపి ఆంధ్రప్రదేశ్‌ AP BJP) నాయకులు అప్రమత్తమయ్యారు. బిజెపి టిడిపితో కలిసి రావాలని పవన్‌ కల్యాణ్‌ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో బిజెపి నేతలు అప్రమత్తమయ్యారు. ఇటీవల జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) బిజెపి ఏపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని (Daggubati Purandeswari) కలిశారు. పొత్తు విషయంపై వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తున్నది. ఎపి బిజెపి నాయకులు మాత్రం టిడిపితో కలిసి పనిచేయాలని, దానివల్ల రాష్ట్రంలో కొన్ని సీట్లయినా సాధించుకోగలుగుతామని అంటున్నట్లు సమాచారం. అయితే, పొత్తులపై తుది నిర్ణయం కేంద్ర నాయకత్వానిదేనని అంటున్నారు. 

బిజెపి పది శాసనసభా స్థానాలు అడుతున్నట్లు సమాచారం. దాంతో పాటు అరకు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి (Tirupathi), రాజంపేట, హిందూపూర్‌ లోకసభ స్థానాలు అడుగుతున్నట్లు తెలుస్తున్నది. అయితే, అన్ని సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు ఇష్టపడకపోవచ్చునని సమాచారం. వైఎస్‌ షర్మిల (YS Sharmiila) కాంగ్రెస్‌లోకి వచ్చిన నేపథ్యంలో కూడా చంద్రబాబు ఆలోచన మారినట్లు చెబుతున్నారు. షర్మిల ప్రభావంతో కాంగ్రెస్‌ విజయం సాధించడం సాధ్యం కాదని, అయితే కాంగ్రెస్‌ గణనీయంగా వైఎస్‌ జగన్‌ (YS Jagan) నాయకత్వంలోని వైసిపి ఓట్లను గణనీయంగా చీలుస్తుందని చంద్రబాబు భావనగా చెబుతున్నారు. అందువల్ల టిడిపి విజయానికి బిజెపి అవసరం లేదని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.

అంతేకాకుండా, వైఎస్‌ జగన్‌ను బిజెపి కాపాడుతూ వచ్చిందనే భావనతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. ఇది కూడా బిజెపికి దూరంగా జరగాలనే చంద్రబాబు ఆలోచనకు కారణమని అంటున్నారు. అయితే, మైనారిటీల ప్రభావం కేవలం పది సీట్లలో మాత్రమే ఉంటుందని అంటున్నారు. మైనారిటీల పేరుతో బిజెపికి దూరంగా ఉండడం సరైంది కాదనే వాదన వినిపిస్తున్నది. 

అయితే, పవన్‌ కల్యాణ్‌ ఆలోచన మరో విధంగా ఉంది. జనసేన, టిడిపిలు బిజెపితో కలిసి పనిచేయాలనేది ఆయన ఆలోచన. బిజెపితో పొత్తుకు చంద్రబాబు చొరవ తీసుకోవాలని ఆయన సూచిస్తున్నట్లు తెలుస్తున్నది. జనసేన, టిడిపి సీట్ల పంపకంపై ప్రకటన చేయడానికి ముందు చంద్రబాబు బిజెపి అగ్రనేతలతో ఒక్కసారి మాట్లాడితే బాగుంటుందని పవన్‌ కల్యాణ్‌ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

సంక్రాంతి పండుగ తర్వాత జనసేన, టిడిపి సీట్ల సర్దుబాటుపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది. జనసేన పోటీ చేసే స్థానాలు కూడా దాదాపుగా ఖరారైనట్లు చెబుతున్నారు. 

- కాసుల ప్రతాపరెడ్డి

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...