Wednesday, January 10, 2024

విషం తాగిన దంపతులు: పిల్లల ముందే తల్లి మృతి, ఆస్పత్రిలో తండ్రి - Couple commits suicide at VIjayawada in Andhra Pradesh

 విషం తాగిన దంపతులు: పిల్లల ముందే తల్లి మృతి, ఆస్పత్రిలో తండ్రి




విజయవాడ: పిల్లల ముందే విషం తాగి దంపతులు ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) రాష్ట్రంలోని విజయవాడ (Vijayawada) శాంతినగర్‌లో జనవరి 9వ తేదీన చోటు చేసుకుంది. పిల్లలకు విషం ఇవ్వడానికి మనసొప్పక దంపతులు ఇరువురు సేవించారు. పిల్లల ముందే మహిళ విలవిలలాడుతూ మరణించింది. తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాయికన్య, ప్రతాప్‌ కుమార్‌ దంపతులు చీటీలో పేరుతో 20 లక్షల రూపాయల మేరకు అప్పుల పాలయ్యారు. దాంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందామనే ఉద్దేశంతో నిన్న సాయం్తం పురుగుల మందు తెచ్చుకున్నారు. ప్రతాప్‌ కుమార్‌ వాటిని నాలుగు గ్లాసుల్లో పోశాడు. 



పురుగుల మందు పోసిన రెండు గ్లాసుల్లో పల్పీ ఆరెంజ్‌ పోసి ప్రతాప్‌ కుమార్‌ పిల్లలను పిలిచాడు. వారికి అది ఇచ్చి చెరో గ్లాసు తాగాలని దంపతులు నిర్ణయించుకున్నారు. పిల్లలను చంపడానికి మనసొప్పక వారికి ఇవ్వాలనుకున్న గ్లాసుల్లోని ద్రవాన్ని కూడా సాయికన్య తాగేసింది. పాయిజన్‌ డోస్‌ ఎక్కువ కావడంతో ఆమె విలవిలలాడుతూ పిల్లల ముందే మరణించింది. ప్రతాప్‌ కుమార్‌ మాత్రం ఒక్క గ్లాసు పురుగుల మందు తాగాడు. దాంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లారు. పిల్లలు చుట్టుపక్కలవారిని పిలిచారు. వారు ప్రతాప్‌ కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి ఆందోళకరంగా ఉంది.

https://kasulapratapreddytalks.blogspot.com/2024/01/couple-attempt-suicide-at-vijayawada.html



















No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...