Wednesday, January 10, 2024

జనసేనలోకి అంబటి రాయుడు: జగన్‌కు రెండు వైపుల నుంచీ షాక్‌ - Amabati rayudu may join in Pawan Kalyan's Jana Sena

 జనసేనలోకి అంబటి రాయుడు: జగన్‌కు రెండు వైపుల నుంచీ షాక్‌


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (AP CM), వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ (YSR Congress) పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి (YS Jaganmohan Reddy)కి రెండు వైపుల నుంచి షాక్‌ తగిలింది. పది రోజుల క్రితం వైసిపి (YCP)ని వీడిన క్రికెటర్‌ Indian Cricketer) అంబటి రాయుడు (Ambati Rayudu) పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నాయకత్వంలోని జనసేన (Jana Sena)లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అంబటి రాయుడు గత డిసెంబర్‌ 28వ తేదీన జగన్‌ సమక్షంలో వైసిపిలో చేరారు. ఆ తర్వాత పది రోజులకే రాజీనామా చేశారు. అయితే, చాలా కాలం క్రితం అంబటి రాయుడు వైఎస్‌ జగన్‌ను కలిశారు. అప్పుడే ఆయన వైసిపిలో చేరడం ఖాయమైంది. అప్పుడే ఆయనకు గుంటూరు లోకసభ (Guntur Lok Sabha seat) సీటు ఇస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. దాంతో గత ఆరు నెలల పాటు గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో పర్యటించారు. తనకు అనుకూలంగా ప్రజా మద్దతు కూడగట్టుకున్నారు. ఈ స్థితిలో వైఎస్‌ జగన్‌ మనసు మార్చుకున్నారు.

Photo Courtesy: X (Twitter)

గుంటూరు లోకసభ సీటు నుంచి పోటీ చేయాలని జగన్‌ నర్సారావుపేట లోకసభ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల (Lavu Srikrishna devarayalu)కు సూచించారు. మచిలీపట్నం నుంచి పోటీ చేయలని ఆయన అంబటి రాయుడికి సూచించినట్లు తెలుస్తున్నది. దాంతో అలక వహించిన అంబటి రాయుడు వైసిపి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నానని, భవిష్యత్తు కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తానని ఆయన చెప్పారు. అంబటి రాయుడు ఆ తర్వాత మరో ట్వీట్‌ చేశారు. తాను దుబాయ్‌లో జరిగే ఐఎల్‌టి 2ట్వంటీ (ILT T20) టోర్నమెంటు ఆడబోతున్నట్లు చెప్పారు. దాంతో క్రికెట్‌ టోర్నమెంటు కోసం ఆయన వైసిపి రాజీనామా చేసినట్లు అందరూ భావించారు. అయితే, అకస్మాత్తుగా ఆయన జనసేనలో చేరడానికి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. 

అంబటి రాయుడిని వదులుకున్న వైఎస్‌ జగన్‌ (YS Jagan) లావు శ్రీకృష్ణదేవరాయల నుంచి కూడా అసమ్మతిని ఎదుర్కుంటున్నారు. తాను గుంటూరు నుంచి పోటీ చేసేది లేదని, నర్సారావుపేట నుంచే పోటీ చేస్తానని ఆయన చెప్పారు. దీంతో జగన్‌కు రెండు వైపుల నుంచి కూడా షాక్‌ తగలినట్లయింది. ఈ క్రమంలోనే అంబటి రాయుడితో జనసేన నేతలు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తున్నది. పలువురు జనసేన నేతలు ఆయనకు టచ్‌లోకి వచ్చారని చెబుతున్నారు. అంబటి రాయుడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కూడా కలవబోతున్నారు. ఆయన ఈ సాయంత్రం పవన్‌ కల్యాణ్‌ను కలిసి పార్టీలో చేరుతారని సమాచారం.

కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు జనసేనలో చేరుతుండడం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. జనసేన ఆయనకు ఏమి ఆఫర్‌ ఇస్తుందనేది వేచి చూడాలి.

- కాసుల ప్రతాపరెడ్డి

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...