Friday, December 22, 2023

తిరుపతి వ్యూహం: పవన్‌ కల్యాణ్‌ చందబ్రాబు అస్త్రం - Tirupati strategy: TDP chief Chandrababu may use Pawan Kalyan to fight YS Jagan

 తిరుపతి వ్యూహం: పవన్‌ కల్యాణ్‌ చందబ్రాబు అస్త్రం 


ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలు (Andhra Pradesh Assembly Election 2024) కొద్ది నెలల్లో రానున్నాయి. గడువు కన్నా ముందే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని కూడా ప్రచారం జరుగుతున్నది. ముందుగానే ఎన్నికలు రావచ్చునని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (YS Jagan) చెప్పారు కూడా. ఆయన తన పార్టీని ఎన్నికల కోసం తన పార్టీని సమాయత్తం చేస్తున్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కూడా వచ్చే ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఎట్టి పరిస్థితిలోనూ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఆయనకు తోడుగా జనసేన (Jana Sena) అధినేత పవన్‌ కల్యాణ్‌ Pawan Kalyan) ఉన్నారు. ఇరువురి మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు కూడా సాగుతున్నాయి. ఎపి శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు జగన్‌పైకి పవన్‌ కల్యాణ్‌ను ఓ అస్త్రంగా ప్రయోగించబోతున్నారు.



గత ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసి ఒక్క స్థానాన్ని మాత్రమే కైవసం చేసుకుంది. పవన్‌ కల్యాణ్‌ రెండు చోట్ల పోటీ చేసి ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేకపోయారు. ఈసారి తాను శాసనసభలోకి అడుగు పెట్టాలని అనుకోవడమే కాకుండా తన పార్టీ నుంచి సాధ్యమైనంత మందిని గెలిపించుకోవాలని అనుకుంటున్నారు. అదే సమయంలో జగన్‌ నాయకత్వంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ (YSR Congress) పార్టీని ఓడిరచాలనే పట్టుదలతో ఆయన ఉన్నారు. అందుకే ఆయన చంద్రబాబుతో చేతులు కలిపారు.

జనసేనకు చంద్రబాబు ఎన్ని సీట్లు ఇస్తారు, పవన్‌ కల్యాణ్‌ ఎన్ని సీట్లు అడుగుతారు అనే విషయాలను పక్కన పెడితే, పవన్‌ కల్యాణ్‌ను రాయలసీమ (Rayalaseema) నుంచి పోటీ చేయించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. తిరుపతి (Tirupati) నుంచి పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసేలా చూడాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఒక రకంగా పవన్‌ కల్యాణ్‌కు తిరుపతి సురక్షితమైన స్థానం కూడా. గతంలో ప్రజారాజ్యం (Praja rajyam) పార్టీ నుంచి పోటీ చేసి చిరంజీవి (Chiranjeevi) విజయం సాధించారు. పాలకొల్లులో ఆయన ఓటమిపాలైనప్పటికీ తిరుపతి (Tirupathi) ఆయనను శాసనసభకు పంపించింది. తిరుపతి నియోజకవర్గంలో బలిజలు అధిక సంఖ్యలో ఉన్నారు. జయాపజయాలను వారు నిర్ణయించే పరిస్థితి ఉంది. అది పవన్‌ కల్యాణ్‌కు సంబంధించి సానుకూలమైన అంశం.

చంద్రబాబు వ్యూహం మాత్రం జగన్‌ను టార్గెట్‌ చేయడానికి, రాయలసీమలో జగన్‌ ప్రాబల్యానికి గండి కొట్డడానికి వపన్‌ కల్యాణ్‌ తిరుపతి నుంచి పోటీ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏదో ఒక సీటు నుంచి పవన్‌ కల్యాణ్‌ పోటీ చేయడం కన్నా తిరుపతి నుంచి పోటీ చేస్తే అదనపు ప్రయోజనం చేకూరుతుందని ఆయన అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతున్నది. తిరుపతి నుంచి పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తే టిడిపి, జనసేన కూటమి (TDP, Jana Sena alliance)కి ఒక ఊపు వస్తుందనేది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. 

గత ఎన్నికల్లో టిడిపి రాయలసీమలోని 52 స్థానాల్లో మూడు స్థానాలు మాత్రమే గెలుచుకుంది. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు, హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ (nandamuri Balakrishna), ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్‌ (Payyavula Kesav) విజయం సాధించారు. ఈసారి రాయలసీమలో వైసిపి ఓట్లకు గండి కొట్టి సాధ్యమైనన్ని సీట్లను సాధించుకోకపోతే విజయం సాధించడం కష్టమని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే, పవన్‌ కల్యాణ్‌ తిరుపతి నుంచి పోటీ చేస్తే ఫలితం ఉంటుందని చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో వైసిపి నుంచి పోటీ చేసిన భూమన కరుణాకర్‌ రెడ్డి స్వల్ప మెజారిటీతోనే విజయం సాధించారు.

పవన్‌ కల్యాణ్‌ తిరుపతి నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతారా, లేదా అనేది కొద్ది రోజుల్లో తేలిపోవచ్చు. ఆయన అందుకు సిద్ధపడితే చంద్రబాబు పాచిక పారినట్లేనని అనుకోవచ్చు. 

- కాసుల ప్రతాపరెడ్డి

No comments:

Post a Comment

చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... KTR insulted Telangana people who voted against BRS

  చింత చచ్చినా పులుపు... కేటీఆర్ కు అదే అహంకారం... చింత చచ్చినా పులుపు చావలేదని ఓ సామెత ఉంది. బీఆర్ఎస్ (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ ర...